ప్రస్తుతం అటు బుల్లితెరపైనే కాకుండా ఇటు టాలీవుడ్ తెరపై కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న యాంకర్ కం నటి అనసూయ. మొదట్లో ఒక న్యూస్ ఛానల్ లో చిన్న షోలు చేసిన అనసూయ, ఆపై మెల్లగా అవకాశాలు అందిపుచ్చుకుని పలు టివి చానల్స్ లో కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఆమెకు అనుకోకుండా ఈటివి ఛానల్ వారు ప్రారంభించిన జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం రావడం, అనూహ్యంగా ఆ షో సూపర్ సక్సెస్ అవడంతో అనసూయకు పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగాయి. అయితే ఆ షోకు అనసూయ యాంకరింగ్ కూడా చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మరికొద్దిరోజుల్లో అనసూయ జబర్దస్త్ షో నుండి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దానికి ఒక కారణం ఉందట, అదేమిటంటే, ఆమెకు ఇదిరేవరకటితో పోలిస్తే ప్రస్తుతం సినిమా అవకాశాలు ఒకింత పెరిగాయంటే, నిజానికి అనసూయ క్షణం సినిమాలో చేసిన పోలిస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తరువాత రంగస్థలంలో చేసిన రంగమ్మత్త పాత్ర, అలానే యాత్ర సినిమాలో పోషించిన పాత్రలు నటిగా ఆమెకు ఎంతో పేరును తీసుకువచ్చాయి. ఇక అక్కడినుండి ఆమెకు సినిమా అవకాశాలు కూడా పెరిగాయట. ఈ నేపథ్యంలో అటు టివి ప్రోగ్రామ్స్ తో పాటు ఇటు సినిమాలు రెండిటి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతోందని, అదీకాక ఒక్కోమారు కొన్ని సినిమా షూటింగ్స్ వేరే ప్రాంతాల్లో ఉన్న సమయంలో టివి ప్రోగ్రామ్స్ కి రావడం అసలు కుదరడం లేదని, 

అందుకని రాబోయే మరికొద్దిరోజుల్లో టివి షోలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని, అంతేకాక జబర్దస్త్ కు కూడా ఇకపై యాంకర్ గా చేయలేకపోవచ్చని తన సన్నిహితులకు ఇటీవల చెప్పిందట అనసూయ. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తపై ఇప్పటివరకు ఆమె నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఉదయం నుండి ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం ఆమె నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే...! 


మరింత సమాచారం తెలుసుకోండి: