టాలీవుడ్ లో సీనియర్ నటులలో బాలకృష్ణ ఒకరు. ఒకసారి ఈయన పక్కన నటించిన ముద్దుగుమ్మలేవరు మరోసారి నటించడానికి అంత ఆశక్తి చూపరు. అయితే ఒకరు మాత్రం బాలయ్యతో సినిమాకు సై అంటున్నారు. ఆమె ఎవరో కాదు అందాల నటి శ్రియ శరణ్. పెద్ద అవకాశాలు చేతిలో ఉన్నప్పుడు టాలీవుడ్ వైపు కన్నెత్తే చూడలేదు. శ్రియ లేడీ ఓరియంట్ చిత్రాలు నటిస్తుంది. అవి అనుకున్నంత విజయం సాధించడం లేదు. దీంతో అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి.

కె యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య కొత్త సినిమా ఈమధ్యే లాంచ్ అయిన సంగతి తెలిసిందే.  సినిమాకు కొబ్బరికాయ అయితే కొట్టారు కానీ హీరోయిన్ ను ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు.  తాజాగా ఈ సినిమాకు సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్ ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో బాలయ్య, శ్రియలు కలిసి నాల్గోసారి తెరపై కనిపించనున్నారు.

'చెన్నకేశవరెడ్డి'.. 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. 'పైసా వసూల్' చిత్రాల్లో శ్రియ హీరోయిన్ గా బాలయ్యతో శ్రియ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించింది.  చిత్రమైన విషయం ఏంటంటే చివరి రెండు సినిమాలు ఈమధ్య వచ్చినవే కావడం.  శ్రియ నటన.. ప్రొఫెషనలిజంపై బాలయ్యకు మంచి గురి ఉందట. అందుకే ఎక్కువ సెర్చ్ చేయకుండానే శ్రియను ఫైనలైజ్ చేశారని సమాచారం. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.  శ్రియ ఒక హీరోయిన్ కాబట్టి రెండవ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. 

శ్రియ పోయినేడాది తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి శ్రియకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి. తమిళంలో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి కానీ తెలుగులో ఆఫర్లు లేవు.   టాలీవుడ్ లో పూర్తిగా ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో ఈ ఆఫర్ శ్రియకు బాలయ్య సినిమా ఆఫర్ జాక్ పాట్ లాంటిదే అనుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: