సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.దానికి బాధ్యతగా స్పందించమని ఎవరు కోరిన వారి పై నా నోరు నా ఇష్టం అంటూ ఫైర్ అవుతుంటారు.అలాంటి వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ నుండి తన శైలిని మార్చుకొని కొంత బాధ్యతాయుతంగా ట్వీట్ లు చేస్తున్నారు.

మొన్న పవన్ తనను డబ్బులు తీసుకొని ఓడించారు అని చేసిన విమర్శలపై ప్రజలకు ఎవరినీ ఎప్పుడు గెలిపించాలో తెలుసని అలాగే డబ్బులు తీసుకున్న తాము ఓటు వేయాలనుకునేవారికి ఓటు వేస్తారని ట్వీట్ చేశారు.వర్మ అలాంటి బాధ్యత కలిగిన ట్వీట్ చేయడం తో విశ్లేషకులు అందరూ నోటి మీద వేలేసుకున్నారు.

మరోసారి అసెంబ్లీ లో జరగుతున్న చర్చలు జరిగిపోయిన వాటి మీద కాకుండా జరగాల్సిన వాటి మీద జరిగితే బాగుంటుందని అలాగే ఎమ్మెల్యే లు స్కూల్ లో పిల్లలా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వారందరూ రాంగోపాల్ వర్మ కు ఏమైందని చెవులు కొరుక్కంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: