విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ముందునుండి ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి.


భరత్ కమ్మ తొలి సినిమా కాబట్టి అతను చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కించాడట. అయితే ఆల్రెడీ వరుస హిట్ల మీద ఉన్న విజయ్ దేవరకొండ షూటింగ్ లో తన డామినేషన్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాడట. అందుకే సినిమా షూటింగ్ లో కూడా గొడవలు జరిగాయట. ఫైనల్ గా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఈ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందట.  


సినిమాను తాను అనుకున్నట్టుగా కట్ చేయాలని భరత్ కమ్మ అంటుంటే కొన్ని సీన్స్ యాడ్ చేయాల్సిందిగా విజయ్ కోరుతున్నాడట. ఇలా విజయ్ భరత్ కమ్మల మధ్య గొడవతో డియర్ కామ్రేడ్ సినిమా ఆగిపోయిందట. నిర్మాతలు ఎంత సర్ధి చెబుతున్నా హీరో, డైరక్టర్ మధ్య వ్యవహారం ముదిరిందని తెలుస్తుంది.


ఎంత పెద్ద స్టార్ అయినా డైరక్టర్ చెప్పినట్టు వినాల్సిందే.. కాని వరుస హిట్లు కొడుతున్నా అనే నమ్మకంతో డెబ్యూ డైరక్టర్ మాట పెడచెవిన పెడుతున్నాడట విజయ్ దేవరకొండ మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని క్రేజీ ప్రాజెక్ట్ గా భావించిన డియర్ కామ్రేడ్ పై ఇలాంటి వార్తలు సినిమాపై ఆసక్తి తగ్గించేలా చేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: