బాహుబలి, బాహుబలి 2 దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన తరువాత ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సాహో. ఇటీవల ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ జోడి కడుతుండగా, మరొక హీరోయిన్ ఎల్విన్ శర్మ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. తొలి సినిమా రన్ రాజా రన్ తో మంచి సక్సెస్ అందుకున్న సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక టీజర్ విడుదల తరువాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. యువి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ మిత్రులు వంశీ, ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపుగా రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మొత్తం సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచే చేజింగ్ సీన్ ఒకటి ఉందని, ఇటీవల దుబాయిలో చిత్రీకరించిన ఈ క్రేజీ యాక్షన్ సీన్, సినిమాలో దాదాపుగా 20 నిమిషాలపాటు ఉంటుందని సమాచారం. ఇక ఈ సీన్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయమని, 

అంతేకాక ఆ సీన్ చూసిన మన ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ మూవీలో సీన్ చూసినట్లు అనిపించేలా చిత్రీకరించిందట సినిమా యూనిట్. అయితే ఈ తరహా యాక్షన్ సీన్స్ సినిమాలో మరికొన్ని ఉన్నప్పటికీ ఈ సీన్ ఎంతో థ్రిల్లింగ్ గా ఉండి, అందరికి మంచి ఐ ఫీస్ట్ ని కలిగించడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలున్న ఈ సినిమాకి, మధ్యలో ప్రేక్షకులకు కిక్ ఇచ్చే ఇటువంటి వార్తలు బయటకు వస్తుండడంతో ఆ అంచనాలు మరింతగా పై పైకి చేరుతున్నాయి. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఆ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: