ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టి స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఆ మధ్య ఇద్దరు హీరోలు చిన్నపాటి గాయాలపాలైన కారణంగా ఈ చిత్ర షూటింగ్ కి కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వారిద్దరూ తేరుకోవడంతో, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అహ్మదాబాద్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ షెడ్యూల్ కి పెద్ద బ్రేక్ పడ్డట్లు సమాచారం అందుతోంది. 

ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్త ఎంటంటే, ఇందులో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్, ఓవైపు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. అయితే మండే ఎండల్లో ఆ సినిమా షూటింగ్ చేస్తున్న అలియా, కొద్దిరోజుల ముందునుండి తన ప్రేగులో కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స తీసుకుంటోందట. ఇక మండుతున్న ఎండల్లో షూటింగ్ చేయడంతో ఆ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అయిందని సమాచారం. అయితే ఆమె సమస్యను తెలుసుకున్న బ్రహ్మాస్త్ర యూనిట్, తమ సినిమా షూటింగ్ ని వెంటనే రద్దు చేసిందని అంటున్నారు. అంతేకాక తన చిటికిత్స నిమిత్తం అలియా భట్ న్యూయార్క్ వెళ్తోందని అంటున్నారు. ఇక ఆమె తిరిగివచ్చిన తరువాత ముందు బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటుందని, 

ఆ తరువాతనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొండడం జరుగుతుందని ఆమె సన్నిహిత వర్గాలవారు అంటున్నారట. ఇక దీన్నిబట్టి చూస్తుంటే అలియా చికిత్స తరువాత బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొనేసరికి చాలా టైం పడుతుందని, దీని ప్రకారం చూస్తుంటే ఆర్ఆర్ఆర్ అహ్మదాబాద్ షెడ్యూల్ మరికొద్దిరోజులు వాయిదాపడేలా కనపడుతోందని సమాచారం. అయితే ఈ వార్తలో నిజానిజాలు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ నుండి వెల్లడికావలసి ఉంది. కాగా ప్రస్తతం ఈ వార్త అటు టాలీవుడ్ వర్గాలతో పాటు ఇటు సోషల్ మీడియా మాద్యమాల్లోను విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: