ఈ సందర్బంగా చిత్రం గురించి నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ...`` చారిత్రాత్మక ,యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
కథాంశంలో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , గుర్రపుస్వారీ, కత్తి సాములకు సంబంధించిన శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం`` అన్నారు