ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎక్కువగా మద్దతు తెలిపిన వారిలో ముందున్నారు పోసాని కృష్ణ మురళి. జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన నాటినుండి అడపాదడపా జగన్ పాదయాత్రలో పాల్గొంటూ మద్దతు తెలిపి మీడియా సమావేశాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీపై మరియు చంద్రబాబుపై కామెంట్స్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు.


అయితే జరిగిన ఎన్నికలలో జగన్ గట్టిగా గెలవడం మరోపక్క చంద్రబాబు దారుణంగా ఓడిపోవడంతో ...సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేవారు ఉండటంతో తనకి అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగన్ కు మద్దతు ఇవ్వడం వల్ల సినిమా ఆఫర్స్ బాగా తగ్గాయని అన్నారు. ప్రస్తుతం పోసాని అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు.


చంద్రబాబుని, టీడీపీని తిట్టానని కొన్ని సినిమాల నుంచి తనని తీసేశారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఓ చిత్రంలో నన్ను ఎంపిక చేసిన తర్వాత కూడా లిస్టులో నుంచి తన పేరు తీసేశారని పోసాని ఆరోపించారు. ఆ నిర్మాత ఎవరో కాదు అశ్విని దత్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో నాకు జగన్ నచ్చారు. కానీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా టీడీపీ మద్దతు దారులే ఉన్నారు. దీనివల్ల సహజంగానే తనకు అవకాశాలు తగ్గుతాయని పోసాని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: