టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న దర్శకులలో ముందు వరుసలో ఉన్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోలలో రామ్. ప్రస్తుతం వీరిద్దరికీ కెరీర్ లో హిట్ పడటం ఎంతో అవసరం. గతంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని రోజులలో సినిమాలు తీసి ఇండస్ట్రీలో అనేక బ్లాక్ బస్టర్ లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.


ఇదే క్రమంలో గతంలో రామ్ కూడా వరుస విజయాలు నమోదు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ సరైన హిట్ లేదు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి. ఇటువంటి క్రమంలో మొట్ట మొదటి సారి వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. తాజాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇటువంటి క్రమంలో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నా నిర్మాత కం డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరల్డ్ కప్ సీజన్ అయిన నేపథ్యంలో వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకువెళ్లడం పెద్ద టాస్క్ గా మారింది. అన్నింటినీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో పూరి జగన్నాథ్ లో ఉన్నారట. ఈ నేపథ్యంలో మొదటిగా జూలై 12 వ తారీఖున విడుదల చేయాలని భావించిన డైరెక్టర్ పూరి ఇప్పుడు తాజాగా జూలై 18 వ తారీఖున విడుదల చేయాలని భారీగా ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: