కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విక్రమ్ అంటే పడిచచ్చిపోతారు చాలామంది అభిమానులు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా గాని విక్రమ్ కి ఎక్కడా కూడా క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా పాత కోసం విక్రమ్ ఎంతటి దానికైనా ఎన్ని ప్రయోగాలు కైనా సిద్ధపడతాడు. అంతగా సినిమానే ప్రేమించే హీరో విక్రమ్ తన కొడుకుని అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ లో నటింప చేస్తున్నారు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగు హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి క్రేజ్ ని సంపాదించింది.


ముందుగా తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఓవర్ నైట్ లోనే మంచి పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ కి ఈ సినిమాతోనే స్టార్ డమ్ వచ్చేసింది. మరోపక్క ఇదే సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు.


తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు విక్రం వారసుడు ధృవ్ నటించిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ రిలీజ్ కు రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డిని మరిపించడమే కష్టం అనుకుంటే ఇప్పుడు కొత్తగా కబీర్ సింగ్ వచ్చి తోడయ్యింది. తమిళ ప్రేక్షకులకు ఆన్ లైన్ లో అర్జున్ రెడ్డిని ధియేటర్లలో కబీర్ సింగ్ ని చూడటం వల్ల సబ్జెక్టు గురించి యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఇటువంటి నేపథ్యంలో విక్రమ్ కొడుకు ధృవ్ పై కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ప్రెజర్ పెరగడంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ధృవ్ యొక్క పరిస్థితి చూసి పాపం అని కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: