నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమాల వేగం పెంచాడని చెప్పొచ్చు. 118 సినిమా పర్వాలేదు అనిపించగా ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. రీసెంట్ గా శతమానం భవతి సతీష్ వేగేశ్న డైరక్షన్ లో సినిమాకు ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ మరో సినిమా లైన్ లో పెట్టాడు.     


సంపత్ నంది డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మాస్ డైరక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమప్త్ నంది కళ్యాణ్ రాం కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. కళ్యాణ్ రామ్ కు కథ వినిపించగా అతనికి నచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.   


ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాను కళ్యాణ్ రాం సొంత బ్యానర్ లో నిర్మిస్తాడని తెలుస్తుంది. కంటెంట్ బాగుంటే కాని రిస్క్ చేయని కళ్యాణ్ రామ్ సంపత్ నంది చెప్పిన కథకు ఫిదా అయ్యాడని తెలుస్తుంది. అందుకే ఆ మూవీని నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. మాస్ కు దగ్గరవ్వాలని కళ్యాణ్ రాం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 


నందమూరి ఫ్యాన్స్ అండదండలు ఉన్నా కూడా ఇప్పటికి కళ్యాణ్ రామ్ స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకోలేదు. అయితే 118 సినిమా తర్వాత ఆలోచన మార్చుకున్న నందమూరి హీరో అలానే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. అందుకే సతీష్ వేగేశ్న డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే సంపత్ నంది మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ రెండు సినిమాలు కళ్యాణ్ రామ్ కు హిట్ ఇస్తాయో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: