తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్  లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని, నిధి అగ్ర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్ అండ్ సాంగ్స్ కు ఇప్పటికే అందరిలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాకు రిలీజ్ డేట్ జులై 12 అంటూ ప్రకటించారు. వాస్తవానికి అంతకన్నా ముందు ఓ డేట్ అనుకున్నారు కానీ అనుకున్న సమయానికి వర్క్ ఫినిష్ కాక జూన్ 12న ఫిక్స్ అయ్యారు. 


అయితే ఇప్పుడు మరోవారం వెనుక్కు వెళ్లబోతోందని లేటెస్ట్ న్యూస్. అయితే ఈ సారి కారణం మాత్రం చిత్ర యూనిట్ కాదు. క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లు వుండడం. 
క్రికెట్ ఫైనల్ లోకి ఇండియా ఎంటర్ అయితే పరిస్థితి వైరల్ గా వుంటుంది. జనాలు టీవీలకు అతుక్కుపోయి ఇంటి నుండి బయటకు రారు. అందుకే వన్ వీక్ వెనక్కు వెళ్తే బెటర్ అని డిసైడ్ అయిందట నిర్మాత చార్మీ టీమ్. ఆ మేరకు నిర్ణయం తీసుకుని జులై 18 గురువారం డిసైడ్ అయ్యారట. కానీ సమస్య ఒకటే, ఆ తరువాత వారంలో డియర్ కామ్రేడ్ వస్తోంది. సినిమా ఎలా వుంటుంది అన్నది అలావుంచితే, విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా వుండదు. 


ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలా వున్నా కూడా విజయ్ దేవరకొండ సినిమా వచ్చిన తరువాత సైడ్ ఇవ్వక తప్పదు. అంతేకాదు ఈ సినిమా వల్ల ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల మీద బాగా ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ వున్న ఒక్క రోజును తట్టుకోగలిగితే, సినిమా ఏమాత్రం కాస్త బాగున్నా 15 రోజులు సోలోగా దూసుకెళ్ళొచ్చు. కానీ హీరో రామ్ మాత్రం వన్ వీక్ అయినా ఓకె వెనక్కే వెళ్దాం అని చెప్పేసాడట. రామ్ ను అలా ఉంచితె  మరి పూరీకి ఈ లాజిక్ ఎందుకు అర్థం కాలేదో.



మరింత సమాచారం తెలుసుకోండి: