తెలుగు పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకత ఉంది. ఎన్.టి.ఆర్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో కృషి చేశారు ఏయన్నార్. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నాగార్జున కూడా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం నటులు సినిమాలు చేస్తున్నారు.


నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా రాణిస్తున్నారు. లవర్ బోయ్ గా ఎలాగోలా చైతు కెరియర్ సాగిస్తుండగా అఖిల్ మాత్రం ఇంతవరకు సక్సెస్ అందుకోలేదు. చేసిన మూడు సినిమాలు అఖిల్ కు నిరాశ కలిగించాయి. ఇక ఇప్పుడు అఖిల్ 4వ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్నాడు. 


నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. మరో పక్క నాగ చైతన్య వెంకీమామ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒకచోట కలిశారు. అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ మొత్తం ఈ ఫోటోలో ఉన్నారు. వెంకట్, నాగ సుశీల, సుప్రియ, నాగ చైతన్య, సమంత, సుశాంత్ ఇలా అందరు ఫ్యామిలీ పిక్ లో ఉన్నారు. 


అయితే అఖిల్, సుమంత్ మాత్రం మిస్ అయ్యారు. అఖిల్ భాస్కర్ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల అక్కినేని ఫ్యామిలీ పిక్ లో జాయిన్ అవలేదు కావొచ్చు మరి సుమంత్ ఎందుకని ఈ ఫోటోలో లేరన్నది తెలియాల్సి ఉంది. సుశాంత్ ఫామ్ జామ్ అంటూ ఫ్యామిలీ పార్టీ అంటూ ఈ పిక్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ పిక్ అక్కినేని ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.     



మరింత సమాచారం తెలుసుకోండి: