ఈవివి సత్యనారాయణ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు తీసే దర్శకుడు కరువయ్యారని చెప్పొచ్చు. అయితే ఉన్నంతలో ఈవివిని గుర్తు చేసేలా సినిమాలు తీశాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి కామెడీ సినిమాలతో అలరించిన శ్రీనివాస్ రెడ్డి కింగ్ నాగార్జునతో చేసిన ఢమరుకం అంచనాలను అందుకోలేకపోవడంతో కెరియర్ రిస్క్ లో పడ్డది.    


మొన్నామధ్య మోహన్ బాబు, అల్లరి నరేష్ లతో మామ మంచు అల్లుడు కంచు సినిమా తీసినా పెద్దగా ఒరిగిందేమి లేదు. అయితే ఈ దర్శకుడు తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ జానర్ ను వదిలేసి కొత్తగా థ్రిల్లర్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడు. జ్యోతి లక్ష్మి ఫేమ్ సత్యదేవ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా 'రాగల 24 గంటలలో' అని పెట్టారు.     


ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. శ్రీనివాస్ అనే నూతన నిర్మాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. కొత్త రైటర్స్ ను పెట్టి మరి స్క్రిప్ట్ సాన పెడుతున్నాడట దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.  


జ్యోతి లక్ష్మి, ఘాజి, బ్లఫ్ మాస్టర్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఐడెంటిటీ తెచ్చుకున్న సత్యదేవ్ ఈసారి ఎలాగైనా రాగల 24 గంటలలో సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. టైటిల్ పోస్టర్ ఒకటి మాత్రమే బయటకు రాగా ఈ సినిమా మిగిలిన కాస్ట్ అండ్ క్రూ ఎవరు ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: