తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు. ఆయన హెయిర్ స్టైల్, సిగరెట్ కాల్చడం, కళ్లజోడు గిరి గిరా తిప్పుతూ పెట్టుకోవడం..అన్నిటికి మించి ఆయన నడకే ఒక స్టైల్ అంటారు. చాలా మంది హీరోలు రజినీ కాంత్ చేసే విన్యాసాలు చేస్తుంటారు. ఏంతమంది హీరోలు వచ్చినా..రజినీ మార్క్ మాత్రం ఎవరూ చెరపలేరని చిత్రపరిశ్రమ అంటుంది. అలాంటి రజినీకాంత్ కి ఓ బుడ్డోడు నీదీ నా స్టైలే అంటూ సవాల్ విసురుతున్నాడు.
ఇంతకీ ఆ బుడ్బోడు ఎవరా అనుకుంటున్నారా...రజినీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ తనయుడు రజనీని వేద్. ఆ మద్య రజినీకాంత్ నటించిన కబాలి మూవీ స్టైల్ లో నిల్చొని తాతకు చూశావా స్టైల్ అంటూ ఫోజ్ కొట్టాడు. రజనీని వేద్ ఇమిటేట్ చేసేలా ఉన్న ఫోటోను సౌందర్య ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటోకు నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఆమె `తాతలాగే మనవడు` అనే క్యాప్షన్ను కూడా ఈ ఫోటోకు ఇచ్చారు. కాకపోతే ఇక్కడే కొంత మంది ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారు..ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా నటిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ని తాతయ్య అనడం ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
`ప్లీజ్ మేడమ్ రజనీకాంత్ను తాత అనకండి` అని సౌందర్యకు మెసేజ్లు పోస్ట్ చేశారు. తాజాగా రజినీకాంత్, నయనతార కాంబినేషన్ లో మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’మూవీ వస్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.