శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ హీరో నిఖిల్ ప్రస్తుతం తన కెరీర్ లో మొదటిసారి చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నాడు. అర్జున్ సురవరం విడుదల దాకా వచ్చి ఆగిపోవడం నిఖిల్ నే కాదు అభిమానులను కూడా షాకిచ్చింది. ట్రైలర్  మంచి టాక్ తెచ్చుకుని బిజినెస్ సర్కిల్స్ లో హైప్ వచ్చినా ఏవో కారణాలతో నిర్మాతలు ఈ సినిమాని థియేటర్ల వరకు తీసుకురాలేకపోవడం నిఖిల్ కి నెగిటివ్ అయింది. ఇప్పటికీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేదు. నిఖిల్ మాత్రం దీని అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇలాంటి సినిమాలకు అనుకూలంగా ఉండే జూన్ జులై నెలలను వదిలేయడంతో ఇప్పుడు బాధ పడుతున్నాడు.


రీసెంట్‌గా కార్తికేయ 2 చేయబోతున్నట్టుగా ప్రకటించిన నిఖిల్ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేదు. చందు మొండేటి చెప్పిన కథ నిఖిల్ మార్కెట్ ని మించి బడ్జెట్ డిమాండ్ చేస్తున్నా సబ్జెక్టు నచ్చిన ఓ నిర్మాత రెడీ అయ్యాడట. కానీ చందు మొండేటి శర్వానంద్ తో ఓ మూవీ కమిట్ అయ్యాడు. సినిమా పూర్తయ్యాకే నిఖిల్ తో కార్తికేయ 2 సినిమా చెస్తాడట. అంతకముందు నివేదా థామస్ హీరోయిన్ గా శ్వాస అనే ఇంకో సినిమా స్టార్ట్ చేశాడు నిఖిల్. అయితే ప్రస్తుతం ఆ సినిమా కూడా ఆగిపోయినట్టు సమాచారం. 


ఈ సినిమాలు కాకుండా ఇంకో రెండు కథలు ఒప్పుకున్నాడట నిఖిల్. వాటిలో ఒకటి విఐ ఆనంద్ దర్శకత్వం వహించే సినిమా. అయితే రవితేజతో డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్న ఇతను ఇంకో ఆరు నెలల దాకా ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ ది ఇదే పరిస్థితి. తను కూడా వెంకటేష్ తో ఓ మూవీ ప్లాన్ చేసినట్టుగా టాక్. ఒకవేళ ఆ సినిమా లేట్ అయితే నిఖిల్ తో తరుణ్ కి సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కిరాక్ పార్టీ తర్వాత ఇంత గ్యాప్ రావడంతో నిఖిల్  అయోమయంలో పడ్డాడు. మరీ టాలీవుడ్ ఎందుకు నిఖిల్ కి ఈ పరీక్ష పెడుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: