ప్రస్తుతం బుల్లితెరపై లేడీ యాంకర్లుగా దూసుకెళ్తున్న వారిలో శ్రీముఖి కూడా ఒకరు అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం సినిమాల్లో కూడా అక్కడక్కడా చిన్న పాత్రల్లో తళుక్కుమన్న శ్రీముఖికి, ఈటివి ప్లస్ చానల్ లో ప్రసారం అయిన పటాస్ అనే షో ద్వారా మంచి గుర్తింపు మరియు క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆమె మరికొన్ని టెలివిజన్ షోల్లో పాల్గొని మంచి పేరు సంపాదించింది. 

ఇకపోతే ఇటీవల నటుడు మరియు మాటల రచయితైన హర్షవర్ధన్ రూపొందించిన గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా శ్రీముఖి నటించింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె కొన్ని టివి షోస్ కి యాంకర్ గా చేస్తోంది. అయితే త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ లో కొందరు సెలెబ్రిటీలతో పాటు శ్రీముఖి, లాస్య వంటి యాంకర్లు కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే కొందరు శ్రీముఖి అభిమానులు మాత్రం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తప్పనిసరిగా ఆ షోలో శ్రీముఖిని ఎంపిక చేయాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

నిజానికి ఈ షోలో పార్టిసిపెంట్స్ గా ఎవరు ఉంటారు అనేది తేల్చాల్సింది బిగ్ బాస్ షో యాజమాన్యం అని, ఎక్కువగా ఎవరికైతే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుందో అటువంటి వారినే బిగ్ బాస్ టీమ్ ఎంపిక చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి ఆ విధంగా చూస్తే శ్రీముఖి, లాస్య వంటివారు ఈ సారి సీజన్ లో ఉండే అవకాశం లేకపోలేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి శ్రీముఖి ఫ్యాన్స్ కోరుతున్నట్లు ఆమె ఈ సీజన్లో ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: