సాయి ధరమ్ తేజ్ రొమాంటిక్ కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో “ప్రతిరోజూ పండగే” చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాశి ఖన్నాహీరోయిన్ గా ధరమ్ సరసన నటిస్తుంది. నిన్న ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ హైద్రాబాద్లోప్రారంభమైంది. మొదటి రోజు “ప్రతిరోజూ పండగే” చిత్ర షూటింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అని తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఈ యంగ్ హీరో.
ఒకప్పుడు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకొచ్చి ఆ తర్వాత ఉన్నట్లుండి కింద పడిపోయారు మెగా మేనల్లుడు. ఈయనకు సరైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. కెరీర్ స్టార్టింగ్లో వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ సుప్రీం హీరో తరువాత డీలా పడిపోయారు. వరుస ఫ్లాప్లు ఎదురుకావటంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల చిత్రలహరితో కాస్త పరవాలేదనిపించినా సూపర్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు.
తాజాగా దేవ కట్టా సాయి ధరమ్కు ఓ లైన్ వినిపించారట. పూర్తి సీరియస్ మోడ్లో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ కథ సాయి ధరమ్ తేజ్కు నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పారట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితేగాని ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
కాగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ, ప్రమోద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.