హమ్మయ్యా... బతికిపోయాను, పవన్ తో పాట ఒప్పుకుంటే నా పరువు పోయేది అంటూ యాంకర్ అనసూయ మళ్లీ బాంబు పేల్చింది. ఇప్పటికే ఆమె పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్లు దుమారం లేపిన విషయం తెలిసిందే. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు కూడా ఎదుర్కొంది ఆమె.

అత్తారింటికి దారేది సినిమాలో ఐటం సాంగ్ కోసం పవన్ సరసన నటించమని అనసూయను అడిగారు, అయితే ఎవరు ఊహించని రేంజిలో ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించడం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేసిన ట్వీట్లు ఇంకా వివాదాస్పదమయ్యాయి.

ఇది చాల దన్నట్టు ఇప్పడు మళ్లీ ‘అత్తారింటికి దారేది’ సినిమా చూసాను, పవన్ తో ఒప్పుకోకపోవడం ఎంతో మంచిదయింది, లేకుంటే నన్ను కూడా ముంతాజ్, హంసానందినిల ఖాతాలో పడిపోయేదాన్ని అంది. ఇక పవన్ అభిమానులను ఉద్దేశించి తన ట్వీట్లు నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలి కాని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయకూడదని అంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: