ఈ ఇయర్ ఎఫ్-2 తో హిట్ అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్న అమ్మడు రీసెంట్ గా రాజు గారి గది 3కి సెలెక్ట్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేస్తున్న రాజు గారి గది మూడవ సీక్వల్ గా ఈ సినిమా వస్తుంది.


టైటిల్స్ మాత్రమే సీక్వల్ గా వస్తున్నా సినిమా కథలు మాత్రం వేరుగా ఉంటున్నాయి. రాజు గారి గది హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన రాజు గారి గది 2 స్టార్ కాస్టింగ్ తో తీసినా ప్రేక్షకులను మెప్పించలేదు. నాగార్జున, సమంత వంటి స్టార్స్ రాజు గారి గది 2 సినిమాలో నటించారు. అయితే గది 2లో ఏదో మ్యాజిక్ మిస్సయిందని గుర్తించిన ఓంకార్ ఆ సినిమాతోనే వస్తున్నాడు.


రాజు గారి గది 3 హిట్ పక్కా అన్న ధైర్యంతో ఉన్నాడు ఓంకార్. తమ్ముడు అశ్విన్ హీరోగా ఈ సినిమా వస్తుంది. అయితే సినిమాలో తమన్నా నటిస్తుందని ముహుర్తం రోజు రివీల్ చేశారు. కాని లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ సినిమా నుండి తమన్నా బయటకు వచ్చిందట. ఎందుకు మిల్కీ బ్యూటీ ఆ సినిమా నుండి ఎగ్జిట్ అయ్యింది అంటే బాలీవుడ్ ఆఫర్ రావడం వల్ల ఈ సినిమా వదులుకుందట.


తెలుగులో స్టార్ హీరోయిన్స్ అయినా బాలీవుడ్ ఛాన్స్ వస్తే చాలు అదో గొప్ప అవకాశంగా ఫీల్ అవుతారు. ఇక్కడ సినిమాలు వదిలి పెట్టి మరి అక్కడకు వెళ్లి సినిమాలు చేస్తారు. వారి దారిలోనే తమన్నా కూడా తనకు వచ్చిన బాలీవుడ్ ఛాన్స్ కోసం రాజు గారి గది 3 సినిమా చేయలేనని చెప్పిందట. మరి ముందే షెడ్యూల్ వేసుకున్న ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: