టాలీవుడ్ లో కామెడీ హీరోగా నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ప్రముఖ హాస్య దర్శకులు జంద్యాల దర్శకత్వంలో ఎన్నో కామెడీ సినిమాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తండ్రి, మామ, తాత పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు చిన్న నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ వార్తల్లోకి ఎక్కలేదు.
ప్రస్తుతం ఆయన నటించిన ‘ఓ బేబీ’సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అక్కినేని సమంత ముఖ్యపాత్రలో నటించిన ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. ఈ మూవీలో సీనియర్ నటి లక్ష్మీ నటించారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరో నాగశౌర్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో తన పాత్ర పేరు చంటి అని, తానే సమంతకు, లక్ష్మికి బాయ్ ఫ్రెండ్ నని చెప్పారు. తానే బాయ్ ఫ్రెండ్ నని ఫీల్ అవుతున్న నాగశౌర్య వేస్ట్ ఫెలో అని, ఆల్ రెడీ కాలు విరగొట్టుకొని వచ్చాడని అంటూ నవ్వులు పూయించారు. ఈ మద్య తనపై కొన్ని రూమర్లు వస్తున్నాయని..తాను 42 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నడూ మందు కొట్టి షూటింగ్ కు వెళ్లలేదని, 'ఓ బేబీ' సినిమాలో ఉన్న సీన్ కోసం, ఆ మూడ్ ను క్యారీ చేసేందుకు మాత్రమే అలా ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చేనెల 5వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.