నాగేశ్వరరావు గారు నాస్తికుడు. దేవుళ్లకు ఆయన పూజలు చేయరంటారు. ఆయన వారసుడు నాగార్జునకు మాత్రం భక్తి మెండుగానే ఉంది. తరచూ తిరుమలకు వస్తూంటాడు. ఇక ఆయన భక్తి చిత్రాల్లో నటించి పరమ భక్తుడిగా మారిపోయారు కూడా.


ఇదిలా ఉండగా నాగార్జున ఇపుడు మన్మధుడు 2 లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ తో నాగ్ రొమాన్స్ అదుర్స్ అన్న రేంజిలో ఉంటుందంట. సాంగులు, సీన్లు ఆహా అనిపిస్తాయట. మళ్ళీ రెండు దశాబ్దాల నాటి నవ మన్మధున్ని ఈ మూవీలో చూడొచ్చు అంటున్నారు.


ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో కొత్త మూవీని నాగ్ పట్టలెక్కిస్తున్నాడు. ఆ మూవీయే బంగార్రాజు సీక్వెల్. దీన్ని కురసాల కళ్యాణ్ తీస్తున్నాడు. సొగ్గాడే చిన్ని నాయన మూవీని బ్లాక్ బస్టర్ చేసిన కళ్యాణ్ ఇపుడు బంగార్రాజుగా నాగ్ ని డిఫెరెంట్ లుక్ లో చూపించబోతున్నాడుట.


ఈ మూవీలో నాగ్ సరదాలు, సరసాలు చెప్పలేమని అంటున్నారు. రసిక హ్రుదయాలను కొల్లగొట్టేలా నాగ్ పాత్రను డిజైన్ చేశారని అంటున్నారు. ఇక ఈ మూవీలో నాగ్ సరసన  మొదట కాజల్ ని అనుకున్నారుట. ఆమె ఇపుడు ఫ్లాప్స్ తో ఉండడమే కాకుండా క్రేజ్ కూడా తగ్గడంతో పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక పూజతో నాగ్ శ్రుంగార పూజలు మొదలెడతారని, తొందరలో ఈ మూవీ సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: