సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క శెట్టి వరుసగా స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతుంది.  మొదట తన అందచందాలతో ఆకట్టుకున్న అనుష్క ‘అరుంధతి’ సినిమా తర్వాత ట్రెండ్ మార్చింది.  లేడీఓరియెంటెడ్ పాత్రలతో స్టార్ హీరోలకు సమానంగా తన సత్తా ఏంటో చాటింది.  కేవలం గ్లామర్ కే ప్రాధాన్యత ఇవ్వకుండా నటనపై ఫోకస్ చేసిన అనుష్క ‘సైజ్ జీరో’లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 

బాహుబలి 2 తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘భాగమతి’తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవల తన ఫిజిక్ పై శ్రద్ద చూపిస్తూ బాగా సన్నబడినట్లు టాక్.  అంతే కాదు అనుష్క సైలెన్స్ సినిమాను ‘సైలెంట్’ మూవీ ఫినిష్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబందించిన ఒక పిక్ ని రిలీజ్ చేసినప్పటికీ అనుష్క అంధకారంలోనే ఉన్నట్లుంది. ఎదో పుస్తకం పట్టుకొని రాస్తున్న ఆమె త్వరలో స్పాట్ లైట్ లోకి వస్తానని చెప్పకనే చెబుతుంది.

హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోంది. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌  ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: