మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ వంటి స్టార్స్ అంతా సినిమాలో ఉన్నారు. వీళ్లే కాకుండా సినిమాలో అనుష్క, తమన్నా కూడా ఉన్నారని తెలుస్తుంది.


తమన్నా పాత్ర గురించి రివీల్ కాలేదు కాని అనుష్క పాత్ర గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమా ఓపెనింగే అనుష్క వాయిస్ ఓవర్ వస్తుందని కొందరు అంటుండగా అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని అన్నారు. లేటెస్ట్ గా సినిమాలో అనుష్క ఝాన్సి లక్ష్మి బాయిగా నటిస్తుందని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి టైంలోనే లక్ష్మి బాయి వీరత్వం చూపించింది. 


రుద్రమదేవిగా అలరించిన అనుష్క లక్ష్మి బాయిగా కనిపిస్తుందని తెలుస్తుంది. కచ్చితంగా అనుష్క ఈ పాత్రలో అలరించడం ఖాయమని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగానే సైరాలో అనుష్క నటించడం జరిగితే సినిమాకు ఆమె పాత్ర చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా అనుష్క సైలెన్స్ సినిమా కూడా చేస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: