టాలీవుడ్ కి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంటర్ అయిన ముద్దుగుమ్మ సమంత రూత్ ప్రభు. ఇక తొలి సినిమాతోనే యువత గుండెల్లో గంట మోగించిన సమంత, ఆ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఆమెకు వరుస ఆఫర్లు రావడం మొదలెట్టాయి. నిజానికి ఏం మాయ చేసావే సినిమాని కేవలం సమంతను చూడానికే అప్పట్లో ఎందరో యువత థియేటర్లకు వెళ్లారంటేనే అర్ధం చేసుకోవచ్చు సమంత క్రేజ్. ఇక ఆ సినిమా తరువాత ఆమె నటించిన ఈగ, దూకుడు సినిమాలు
సూపర్ డూపర్ సక్సెస్ సాధించి టాలీవుడ్ లో ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెట్టాయి. 

ఇక అక్కడినుండి ఇప్పటివరకు తమిళ, తెలుగు భాషల్లో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించిన సమంత, ఇటీవల అక్కినేని వారి అబ్బాయి, మరియు తన తొలి చిత్ర హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఓ బేబీ. కొరియాలో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన మిస్ గ్రానీ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక సరికొత్త పాత్రలో నటిస్తోందని సమాచారం. సీనియర్ నటి లక్ష్మి, నటులు రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, నాగశౌర్య, తేజ సజ్జ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఇక మరొక రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో హైదరాబాద్ లోని దేవి 70 ఎం ఎం థియేటర్లో భారీ స్థాయిలో సమంత కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఎక్కువశాతం హీరోలకు మాత్రమే అంత భారీస్థాయిలో కటౌట్లు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఈ విధంగా ఒక హీరోయిన్ కు ఇంత భారీ కటౌట్ పెట్టడం మాత్రం తొలిసారి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకరకంగా ఈ భారీ కటౌట్ తో సమంత టాలీవుడ్ టాప్ స్టార్స్ కు తాను ఏ మాత్రం తీసిపోనని నిరూపించింది. ఇక ఈ కటౌట్ ఫోటోలను ఆనందోత్సాహాలతో సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో తెగ వైరల్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: