తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’మూవీ.  యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జంటగా రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీపై రక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.  తన ఫ్యామిలీని చంపిన విలన్లను ప్రభాస్ ఫేక్ పోలీస్ గా మారి ఒక్కొక్కిరినీ అంతం చేస్తాడట.  ఈ క్రమంలో దేశ విదేశాల్లో ఉన్న విలన్లను ఛేజ్ చేసి మరీ చంపే సీన్లు చాలా హైలెట్ గా ఉండబోతున్నాయి. 

ఈ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఇక ఈ మూవీలో సాంగ్స్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారట. ముఖ్యంగా ఓ ఐటమ్ సాంగ్ మూవీకే హైలెట్ గా ఉండబోతుందట. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ ప్రభాస్ ‘సాహో’ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. సాహో టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం విదేశాల్లో ప్రభాస్, శ్రద్దా కపూర్ పై సాంగ్స్ షూట్ చేస్తున్నారు. సాహో మూవీపై దేశం మొత్తం భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఇక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఐటెం సాంగ్ లో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్  ఉంటే ఇద్దరికీ సరిజోడుగా ఉంటుందని దర్శకులు భావిస్తున్నారట.  సల్మాన్ ఖాన్ కిక్ చిత్రం ద్వారా జాక్వెలిన్ బాలీవుడ్ లో స్టార్ గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ ని క్రొయేషియాలో చిత్రీకరించనున్నారు. ఆ మద్య రిలీజ్ అయిన సాహూ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: