విజయ్ దేవరకొండ కెరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు డైరెక్టర్ పరశురాం. వీరిద్దరి కలయికలో వచ్చిన గీతాగోవిందం సినిమా అప్పట్లో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.


వీరిద్దరి జోడి సినిమాల్లో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో డైరెక్టర్ పరశురామ్, మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడని ఆ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్ అని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా గురించి అంతగా క్లారిటీ ఇవ్వలేదు హీరో మహేష్ బాబు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మరొకసారి విజయ్ దేవరకొండ తో కలిసి పని చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ పరుశురాం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ విక్రమ్ కె.కుమార్ డైరెక్టర్ తో పని చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు కూడా చేసే పనిలో విజయ్ దేవరకొండ ఉన్నట్లు సమాచారం. ఇటువంటి క్రమంలో విజయ్ దేవరకొండ పరశురాం ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: