విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా మొదటి నుంచి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తాపత్రయపడుతునే వస్తోంది. ఈ సినిమా బాధ్యతలు పూర్తిగా హీరో విజయ్ దేవరకొండ తన భుజాల మీద వేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అందుకనే విజయ్ నే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా అన్ని తానై చూసుకుంటున్నట్లు గా ఇప్పటికే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా చెప్పుకుంటున్నారు. ఆ సంగతి అలా వుంచితే ఇప్పటికే ఒకటికి రెండు మూడుసార్లు ఈ సినిమాకు రీషూట్ లు, పలు వెర్షన్ కట్ లు చేసారని సమాచారం ఉంది. 

అయితే ఈ సినిమాకి సంబంధించి మళ్లీ రీ షూట్ లు పెట్టారని వినిపిస్తోంది. ఈ రీషూట్ కోసం హీరోయిన్ రష్మిక డేట్లు మళ్లీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక వేరే సినిమా షూట్ లో వుంది. అక్కడ డేట్లు అడ్జస్ట్ చేసుకుని, డియర్ కామ్రేడ్ రీషూట్ లకు హాజరవుతున్నట్లు లేటెస్ట్ న్యూస్. అయితే ఈనెల 25న విడుదల వుండగా, ఇప్పటికీ ఇంకా రీషూట్ లు ఏమిటి? అని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ-రష్మిక గీత గోవిందం సూపర్ హిట్ తర్వాత మళ్ళీ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో డియర్ కామ్రేడ్ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. అందుకే సినిమాను ఆంధ్రలో 10 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. సినిమా హిట్ కొడితే బయ్యర్లకు ఓ రేంజ్ లో లాభాలు వస్తాయని టాక్ వుంది. మరి ఇన్నిసార్లు రీషూట్ చేసిన సినిమా రేంజ్ ఏంటనేది విడుదలైతేగాని తెలీదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: