'మణికర్ణిక' తో కొన్నాళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్ త్వరలోనే 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి తెలుగు దర్శకుడు, దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్ రావు, బ్రిజేంద్రకల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ వివాదం తలెత్తడంతో కొన్ని రోజుల క్రితమే విడుదలవ్వాల్సిన థియోట్రికల్ ట్రైలర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే టైటిల్ లో చిన్న మార్పు చేసి రీసెంట్‌గా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.  

ఈ సందర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దేనైనా ఎదిరించే శక్తిని నాకు అభిమానులే ఇచ్చారు. సినిమా పరిశ్రమ గురించి నేను అస్సలు పట్టించుకోను. ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకున్నా నేను అనుకున్నది చేయడం.. మాట్లాడటం చేస్తూ ఉంటాను. నా  ధైర్యానికి కారణం నా అభిమానులే. ఎవరైతే నాకు మద్దతుగా నిలుస్తున్నారో వారందరికి రుణపడి ఉంటానంటూ కంగనా తెలిపింది.

సినిమా పరిశ్రమలో కంగనా గురించి పలు విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఆమె దర్శకుల పనుల్లో ఇన్వాల్వ్ అవుతుందని కొందరు.. ఆమె తన పాత్రకు తానే డైరెక్ట్ చేసుకుంటుందని కొందరు అంటూ ఉంటారు. ఆ విషయాలను పట్టించుకోని కంగనా స్టార్స్ అనే విషయం కూడా చూడకుండా గతంలో పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఒక నటుడు వేదించాడంటూ కేసు కూడా పెట్టిన విషయం తెల్సిందే. ఇదంతా కూడా అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే చేస్తున్నాను అంటూ తన ఫ్యాన్స్ మీదే తోసేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: