అందం, అభినయం ఉన్న అక్కినేని వారి కోడలు సమంత. ఏ మాయ చేసావే అంటూ వచ్చి నిజంగా పెద్ద మాయే చేసేంది. లేకపోతే ఆమెకు స్టార్ స్టాటస్, సూప‌ర్ హిట్స్ ఎలా వస్తాయి. ఏ పాత్ర అయినా అదుర్స్ అన్నట్లుగా చేసేస్తూ  టాలీవుడ్ లో టాప్ రేంజికి చేరుకున్న సమంత పెళ్ళి అయినా కూడా డిమాండ్ తగ్గని హీరోయిన్.


ఓ బేబీ మూవీ ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చిన సమంతకు ఇక్కడ వూహించని ఆదరణ దక్కడంతో ఓ విధంగా షాక్ కి గురి అయింది. విశాఖలోని ఓ ఇంజనీరింగ్ కాలేజికి వెళ్ళిన సమంతను అక్కడ విద్యార్ధులు గ్రాంద్ వెల్ కం పలకడమే కాదు. బాగా స్పందించారు. దాంతో ఓ దశలో సమంత ఫుల్ అమోషన్ అయిపొయారు.


ఇక సమంత మాట్లాడుతూ ఇంతటి అభిమానం పొందడం ఓ వరం అన్నారు. తాను విశాఖ అంటే బాగా ఇష్టపడతానని, ఏ మాయ చేశావే సక్సెస్ మీట్ కూడా విశాఖలోనే జరిగిందని గుర్తు చేస్తుకున్నారు. ఇక ఓ బేబీ మూవీని ప్రతి విధ్యార్ధి తన తల్లితో కలసి చూడాలని సమంతా కోరారు. ఈ నెల 5న విడుదల అవుతున్న ఈ మూవీ తన సినీ జీవితంలో ల్యాండ్ మార్క్ అని సమంత అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: