బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తో ఓ ఊపు ఊపేసిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ ఛాన్స్ అందుకుంది. తెలుగులో స్టార్ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వరుస ఛాన్సులు అందుకుంటుంది.  


ఈమధ్యనే అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ లో నటించింది కియరా అద్వాని. ఆ సినిమా హిట్ తో అమ్మడు అక్కడ మంచి జోష్ లో ఉంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో షేర్షా సినిమా చేస్తున్న కియరా అద్వాని ఆ సినిమా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందని ముంబై మీడియా టాక్.         


ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని అంటున్నారు. పైకి తామిద్దరం కేవలం స్నేహితులమే అని చెబుతున్నా సిద్ధార్థ్, కియరా క్లబ్బులు, ప్లబ్బులు తిరుగుతున్నారట. నైట్ పార్టీస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కు కామనే కాని కియరా సిద్ధార్థ్ ల వ్యవహారం పరిధి దాటి పోతుందని ఎక్కడ చూసిన వీరి జంట కనిపిస్తుందని అంటున్నారు. 


సిద్ధార్థ్ కెరియర్ పర్వాలేదు అయితే కియరా మాత్రం అటు బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాల ఛాన్సులు అందుకుంటుంది. సినిమా ఛాన్సులు వస్తున్న ఇలాంటి టైంలో అమ్మడు ఇలా ప్రేమ దోమా అంటూ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటే ఆమెకే లాస్.. సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కియరా కొన్నాళ్లు వెలుగు వెలిగేలా కనిపిస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: