ఖడ్గం మూవీతో థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ ఫన్నీ డైలాగ్ తో తెగ పాపులర్ అయ్యారు ఫృథ్వి. తర్వాత తన పేరడీ డైలాగ్స్, యాక్షన్ తో తెలుగు కమెడియన్లలో మంచి స్థాయికి ఎదిగారు. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పై కూడా ఆ మద్య చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ లో ఆయనకు కొన్ని సినిమా ఛాన్సులు పోయాయని తెగ వార్తలు వచ్చాయి.
త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఫృథ్వికి మంచి ఛాన్స్ పోయిందని వార్తలు రావడంతో దానిపై స్పందించిన ఫృథ్వి అసలు ఆ సినిమాలో ఛాన్స్ ఉందన్న విషయం తనకు తెలియదని..రూమర్లు నమ్మొద్దని అన్నారు. తాజాగా మెగా ఫ్యామిలీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఫృథ్వి. 'తాడేపల్లిగూడెం నుండి సూట్ కేస్ పట్టుకొని చెన్నైకి వెళ్లింది మెగాహీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కాదు..' అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి నాకు ఎప్పటికీ స్ఫూర్తి అని ఆయనను చూసే సినిమాల్లోకి వచ్చానని అన్నారు.
అయితే ‘సైరా’లో తన పోర్షన్ ని ఎడిటింగ్ లో తీసేస్తారనే వార్తలు కూడా బయటకి వచ్చాయి. దీనిపై స్పందించిన పృథ్వీ.. చిరంజీవి అలా చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. చిరంజీవి తనపట్ల పక్షపాతం చూపరని నమ్మకంగా చెబుతూనే.. మరోపక్క అందరూ మెగాఫ్యామిలీ తనను బ్యాన్ చేసిందని అంటున్నారు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదని అన్నారు.