డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి మరియు హీరో రామ్ కి ఎంతో కీలకం. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీలో ఇద్దరికీ ఉన్న క్రేజ్ నిలబడుతోంది. ఏ మాత్రం సినిమా బెడిసికొట్టిన అసలే చీకటి లో ఉన్న ఇద్దరి కెరీర్లు దుకాణం సర్దుకునే స్థాయికి దిగజారిపోతాయి.


ఈ క్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తానే నిర్మాతగా ఒకపక్క దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ని ఎలాగైనా హిట్ అయ్యేలా భారీ ప్లాన్ లే వేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా తుది దశకు చేరుకున్న నేపథ్యంలో  జులై 18వ తారీకున రిలీజ్ డేట్ ప్రకటించడంతో నిర్మాత పూరి జగన్నాథ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ- రిలీజ్ వేడుక చాలా స్పెషల్ గా చేసే ఆలోచనలో భాగంగా పూరి జగన్నాథ్ వరంగల్ పై ఎవరు ఊహించని ప్లాన్ వేశారు.


ప్రస్తుతం తెలంగాణాలో బోనాలు జరుగుతున్నాయి. బోనాలు సీజన్ ని ఇస్మార్ట్ చిత్ర యూనిట్ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోంది. 'ఇస్మార్ట్ బోనాలు' పేరుతో వరంగల్ నగరంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జులై 7న వరంగల్ లో హైగ్రీవాచారి మైదానంలో ఇస్మార్ట్ బోనాలు చేయడానికి సిద్ధమయ్యారు సినిమా యూనిట్. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా రామ్ పక్కన నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: