టాలీవుడ్లో ఐటీస్ లో కుర్ర విలన్ అంటే అతని పేరే చెప్పేవారు. అపుడు ఓ జనరేషన్ హీరోలు వచ్చారు. వారి ఏజ్ కి సరిపోయే విలన్ కావాల్సివచ్చింది. దాంతో ఆ కుర్ర విలన్ కి ఆఫర్లు పెరిగాయి. బాలయ్య, నాగార్జున ఇలా నాటి హీరోలకు ఎదురుగా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు.. హీరోగా కూడా చేసిన కొన్ని సినిమాలు మంచి పేరు తెచ్చాయి.


ఆయనే రాజేష్. ఆనందభైరవి హీరో. ఆయన అక్క ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి. రాజేష్ 40 ఏళ్ళ వయసులోనే  హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఇపుడు ఆయన కుమార్తె తమిళనాడు లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. మరో వైపు బ్యూటీగా కూడా నిలిచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.


పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా మన నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయాలని వెళ్ళి కలిస్తే అసలు సంగతి తెలిసింది. ఆమె ఎవరో  కాదు. మన తెలుగింటి ఆడపడుచు అని. ఆమె ఐశ్వర్య రాజేష్. కోలీవుడ్లో మంచి నటనతో అదరగొడుతున్న  ఐశ్వర్యని ఇపుడు తెలుగు నిర్మాతలు కూడా బుక్ చేస్తున్నారు.


ఆమెతో మూడు స్టైట్ మూవీస్ తీఎస్తున్నారు. దేవరకొండ విజయ్ పక్కన ఓ మూవీలో నటిస్తున్న ఐశ్వర్య లేటెస్ట్ మూవీ కేరాఫ్ కౌసల్య క్రిష్ణమూర్తి  మూవీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. లేడీ క్రికెటర్ కధగా దీన్ని తీస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీతో ఐశ్వర్య టాలీవుడ్ ఇన్నింగ్స్ మొదలవుతాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: