టాలీవుడ్ లో తేనెమనసులు చిత్రంలో సినిమా రంగ ప్రవేశం చేసిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ సినిమా సక్సెస్ అవడంతో మెల్లగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుని హీరోగా ముందుకు దూసుకెళ్లారు. ఇక అప్పట్లో అతి పెద్ద మాస్ ఇమేజి ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ముందు వరుసలో ఉండేవారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అనంతరం మెల్లగా వయసుమీద పడడంతో సినిమాలు ఒకింత తగ్గించిన అయన, ఆ తరువాత తన పెద్ద తనయుడు రమేష్ బాబు ని హీరోగా పరిచయం చేసారు. అయితే రమేష్ బాబు మాత్రం హీరోగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. 

ఆపై కొన్నేళ్ళకు 1999లో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆయన చిన్న తనయుడు మహేష్ బాబు. తొలిచిత్రంతోనే ఘట్టమనేని అభిమానుల్లో మంచి జోష్ నింపిన మహేష్ బాబు, మెల్లగా ప్రిన్స్ గా ఆపై సూపర్ స్టార్ గా పేరు గడించి, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా అద్భుతమైన పేరు సంపాదించారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎప్పటినుండో ఒక తీరని కోరిక మాత్రం మిగిలిపోయింది. అదేమిటంటే, కృష్ణ గారిని, మహేష్ ని ఒకే సినిమాలో చూడాలన్న వారి ఆశ మాత్రం తీరడం లేదు. నిజానికి గతంలో మహేష్, కృష్ణ గారు కలిసి పద్మాలయ బ్యానర్ పై బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో కలిసి నటించినప్పటికీ, ఆ సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచి అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమా వచ్చి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతుండడంతో కనీసం ఒక్కసారైనా ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే సినిమా తెరపై చూడాలన్న వారి అభిమానుల కోరిక మాత్రం తీరడం లేదు. 

ఇప్పటికే ఈ విషయమై పలువురు కృష్ణ గారు, మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో వారిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి కృష్ణ గారికి వయసు మీద పడడం, అదీకాక ఇటీవల అయన భార్య శ్రీమతి విజయనిర్మల గారు హఠాత్తుగా స్వర్గస్థులవడంతో కృష్ణ గారు మరింత ఢీలా పడ్డారని, కాబట్టి రాబోయే రోజుల్లో అయన సినిమాలు  చేయకపోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఘట్టమనేని అభిమానులకు కలగానే మిగిలిన ఈ కోరిక తీరేదెప్పుడు అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: