జులై, ఆగస్ట్లో మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు సాహో కూడా రిలీజ్కి రెడీగా వుండడంతో కొన్ని సినిమాలకి ఏదో ఒక సినిమాతో క్లాష్ అవ్వక తప్పడం లేదు. ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ లాంటి మిగతా సినిమాలని వదిలేసి శర్వానంద్ 'రణరంగం'తో పోటీకి దిగుతున్నారు మిగతా దర్శక నిర్మాతలు. బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' జులై 18 నుంచి వాయిదా పడి ఆగస్ట్ 2న 'రణరంగం'తో రిలీజ్కి రెడీ అవుతోంది.
కొత్తగా 'గుణ 369' రిలీజ్ కూడా అదే డేట్కి ఫిక్స్ అయింది. 'ఆర్ఎక్స్ 100' స్టార్ అయిన హీరో కార్తికేయ నటిస్తున్న ఈ సినిమా కూడా 'రణరంగం'తో పోటీకి దిగుతోంది. గతంలో శర్వానంద్ సినిమాలని పెద్ద హీరోల సినిమాలతో పోటీగా విడుదల చేసేవారు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు సినిమాలతో భారీ సినిమాలకి ఎదురెళ్లి మరీ శర్వానంద్ సక్సస్ను సాధించాడు.
అలానే ఇప్పుడు శర్వానంద్కి వేరే సినిమాలతో పోటీ తప్పడంలేదు. ప్రస్తుతం ప్రకటించిన సినిమాలలో రేంజ్ పరంగా 'రణరంగం' పెద్ద సినిమా అయినప్పటికీ ఒక్కోసారి మిగతా సినిమాలతో పోటీ వల్ల ఎలాంటి సినిమాకి అయినా ముప్పు తప్పదు. అసలే వారానికో సినిమా రిలీజ్ వున్న టైమ్లో ఇన్ని సినిమాలతో పోటీని శర్వానంద్ ఎలా నెగ్గుకొస్తాడనేది చూడాలి. కానీ చిత్ర బృందం మాత్రం కథ కథనాల మీదున్న గట్టి నమ్మకంతో ఎన్ని సినిమాలు పోటీ ఉన్నప్పటికి 'రణరంగం' ఖచ్చితంగా హిట్ కొడుతుందని ధీమాగా ఉన్నారు.