ఒకప్పుడు తెలుగు సినిమా కమర్షియల్ స్టామినాను చూసిన టైం అంటే సీనియర్ ఎన్టీఆర్ అడవి రాముడు టైం నుంచి మొదలుపెట్టి చిరంజీవి ఇంద్ర వరకు చూసుకుంటే కామెడీకి ఎంత పెద్ద పీఠ వేసేవారో అర్థమవుతుంది. రాజబాబు-అల్లు రామలింగయ్య - బ్రహ్మానందం-బాబు మోహన్- కోట-ఆలీ- ధర్మవరపు-ఏవీఎస్ ఇలా వీళ్ళ కోసమే ప్రతి సినిమాలోనూ కామెడీ ట్రాక్స్ సెపరేట్ గా ఉండేవి. కొన్ని సినిమాలలో అసలు కథను ఇవి పక్కదారి పట్టించేలా ఉన్నా అలా అనిపించకుండా దర్శకులు చూపించే తీరు ప్రేక్షకులు హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉండేవి.
 
అందుకే కమెడియన్లు అతి తక్కువ సమయంలోనే స్టార్లు అయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంతసేపు హీరో పక్కన ఫ్రెండ్స్ పేరుతో ఉండే గొర్రెల బ్యాచ్ గా పుట్టించే కామెడీ తప్ప అదే పనిగా నవ్వించడం కోసం ఏ దర్శక రచయితలు ప్రయత్నించడం లేదు. చూస్తుంటే రాను రాను మెల్లగా హీరో హీరోయిన్లు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కామెడీతో సర్దేస్తున్నారు నేటి తరం దర్శకులు. ఆ మధ్య వచ్చిన వినయ విధేయ రామలో ఈ విషయాన్ని బాగా గమనించవచ్చు. 

ఉన్న ఐదారుగురు కమెడియన్లలో కొందరు హీరో వేషాల మోజులో పడి క్యారెక్టర్ రోల్స్ చేయమని చెప్పడం ఇప్పుడీ పరిస్థితికి అసలు కారణం అని చెప్పొచ్చు. పోనీ వాళ్ళు అందులోనైనా హాస్యాన్ని పండిస్తున్నారా అంటే అదీ లేదు. అర్థం లేని హీరోయిజంతో నిర్మాతలు ప్రేక్షకులను ఇద్దరినీ ఏడిపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 'ఒకప్పుడు' తెలుగు సినిమాలలో లో కామెడీ ఉండేది.. అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అది జరగాలంటే జంధ్యాల-ఈవివి లాంటివి వాళ్ళు మళ్ళి పుట్టరు కానీ వాళ్ళను కనీసం స్ఫూర్తిగా తీసుకుని నవతరం దర్శకులు ఆలోచిస్తే మంచిదని ఇప్పటికే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కామెడీ కంటే కూడా కమర్షియల్ ఎలిమెంట్‌గా మూడు ముద్దులు ఆరు బూతులు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: