మొత్తం టాలీవుడ్లో పెద్ద తలకాయలు వైసీపీ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు. స్టార్లు, టాప్ స్టార్లు కూడా జగన్ సీఎం అయినా కూడా కనీసం కంగ్రాట్స్ చెప్పలేకపోయారు. అలా ఉంది టాలీవుడ్ తీరు. ఇక జగన్ వెంట నడచిన సినీ రంగం ప్రముఖుల్లో ప్రుధ్వీ వంటి వారు మొదటి స్థానంలో ఉన్నారు. జగన్ గెలుపు కోసం ప్రుధ్వీ ఎంతో ప్రచారం చేశారు కూడా. మొత్తానికి జగనన్న సీఎం అయ్యారు.


ఇక ప్రుధ్వీ రుణం తీర్చుకునేందుకు జగన్ ఆలోచన చేస్తున్నారుట.  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న పృథ్వీకి జగన్  ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. 


ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు.


వయోభారం కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో రాఘవేంద్రరావు పేర్కొన్నారు. దీంతో ఇపుడు ప్రుధ్వీ ఈ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని అంటున్నారు. మొత్తానికి ప్రుధ్వీ కష్టానికి తగిన గుర్తింపే లభించిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: