అక్కినేని ఫామిలీ లో ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, శ్రీ నాగ్ కార్పొరేషన్ అంటూ మూడు బేనర్లున్నాయి. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్లో కొత్త బేనర్ పుట్టుకొస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య, సమంత కలిసి కొత్త బేనర్ మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి అని టాక్. 


ఇప్పటిదాకా తండ్రి నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లోనే సినిమాలు చేశాడు చైతూ. ఇప్పు భార్య కోసం అతను బేనర్ పెడుతున్నాడట. ఇటీవలే ‘ఓ బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. ఇది ఆమెకు రెండో లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఆమె కథానాయిక ప్రాధాన్యం ఉన్న మరో సినిమా చేయబోతోందట. ఆ చిత్రాన్ని చైతూనే స్వయంగా నిర్మిస్తాడని సమాచారం. ఇంకా సమంత కెరీర్ లో మంచి సినిమాలు చెయ్యాలంటే సొంత బ్యానర్ ఒకటి కావాలని ఇద్దరికీ అనిపించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డితో సమంతకు మంచి అనుబంధం ఉంది. ఇంతకుముందు ఆమె దర్శకత్వంలో ‘జబర్దస్త్’ అనే సినిమా చేసిందామె. అది సక్సెస్ కాకపోయినా.. ‘ఓ బేబీ’ మంచి విజయం దిశగా సాగుతోంది. అది రీమేక్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈసారి నందిని సొంత కథతో సినిమా తెరకెక్కనుందట. ఇది లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ అని సమాచారం. సమంతకు ముందే ఈ కథను చెప్పిందట నందిని. 


‘ఓ బేబీ’ రిలీజై హిట్ అవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత జోరు తగ్గకపోగా మరింత పెరిగింది. కెరీర్లో ఇంతకుముందు రొటీన్ గ్లామర్ క్యారెక్టర్లే ఎక్కువగా చేసిన సామ్.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో సాగిపోతోంది. ఇందులో చైతూ సపోర్ట్ కీలకం. ఆమెకు మరింత మద్దతు ఇస్తూ ఇప్పుడు సినిమా నిర్మించడానికే చైతూ ముందుకు రావడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: