టాలీవుడ్ ఇండస్ట్రీ కుర్ర హీరో నిఖిల్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. చేసిన సినిమా ప్రాజెక్టులు విడుదలవ్వాల్సిన సమయంలో ఏదో ఒక కారణంతో విడుదల కాకుండా సినిమాలు మూలనపడ్డాయి. కొన్ని సినిమా ప్రాజెక్టులు అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక కూడా సినిమాలు విడుదల అవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో తన కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన కార్తకేయ సీక్వెల్ చేద్దాం అని నిఖిల్  పీపుల్స్ మీడియాతో కలిసి డిసైడ్ అయ్యారు.


కానీ అది కూడా అంత సులువుగా జరిగేలా కనిపించడం లేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఇస్తేనే ముందుకు వెళ్తామని పీపుల్స్ మీడియా సంస్థ స్పష్టంచేసింది. మరో పక్కన దర్శకుడు చందుమొండేటి ఈ ప్రాజెక్టు కన్నా శర్వానంద్ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా. దీంతో శర్వానంద్ ల వలన డైరెక్టర్ చందు పై నిఖిల్ ఒత్తిడి పెట్టడం లేనట్టు...ప్రాజెక్ట్ ని చేయకుండా ఆగిపోవటానికి సిద్ధపడినట్లు...ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


వరుసగా తాను చేస్తున్న సినిమాలు విడుదల వారి సందర్భంలో..తాను చేయాల్సిన ప్రాజెక్టులో వేరొక హీరో శర్వానంద్ రావటంతో..ఈ ప్రాజెక్టు విషయంలో నిఖిల్ పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో కార్తికేయ 2 ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మరోపక్క ఇప్పుడప్పుడే కాకుండా నవంబర్ నుంచి అయితే ఈ సినిమా చేస్తానని డైరెక్టర్ చందుకి...శర్వా చెప్పినట్లు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: