ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి జోరు మీదున్న హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు. మొదటి రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమెకు స్టార్ హీరోల సరసన వరుస పెట్టి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి - మహేష్బాబు దర్శకత్వంలో తెరకెక్కే సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
తక్కువ టైంలోనే ఇంత స్టార్ స్టేటస్ దక్కడంతో తెలుగు పరిశ్రమతో పాటు సొంత పరిశ్రమ కన్నడలో కూడా ఆమె రెమ్యునరేష్ హైక్ చేశారు. దీన్ని అక్కడి సినిమా వాళ్ళు కొందరు తప్పుబట్టారు కూడా. క్రేజ్ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకుంటోందని బాగా గుసగుసలాడుకున్నారు. అయితే దీనిపై రష్మిక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నిర్మాతల మైండ్ బ్లాక్ చేసింది.
ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా గ్రోత్ కోరుకుంటారు. నేను కూడా అలాగే కోరుకున్నాను అంటూ రెమ్యునరేష్ పెంచడంలో తప్పేముంది అన్నట్టు చెప్పింది. దీనిని బట్టి రష్మిక మందన్న నెక్ట్స్ సినిమాల విషయంలో కోటి పైమాటే అన్నట్టుగా ఉంది. ఇక ఆమె కొత్త రేటు చూస్తోన్న నిర్మాతలకు మైండ్ బ్లాక్ అవుతోందట.