మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తుండగా సినిమాకు పాటల వరకే అతని మ్యూజిక్ ఉంటుందని తెలుస్తుంది.   


ఇప్పుడు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే మ్యూజిక్ డైరక్టర్ ను సెట్ చేశారట. ఈమధ్య బాలీవుడ్ లో సూపర్ సెన్సేషన్ మ్యూజిక్ డైరక్టర్ గా మారిన జూలియస్ పకియం సైరా బిజిఎం స్కోర్ ఇవ్వనున్నాడట. రీసెంట్ గా వచ్చిన భారత్ సినిమాకు అతనే మ్యూజిక్ అందించాడు. అంతేకాదు కిక్, భాగి-2, ధూం-3 సినిమాలకు జూలియస్ మ్యూజిక్ అందించాడు. 


సైరా సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తాడని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. సైరా పోస్టర్ కు తమన్ ఇచ్చిన ఆర్.ఆర్ అదిరిపోయింది. అయితే సినిమాలో అతనికి ఛాన్స్ ఇవ్వకుండా నిరాశపరిచారు. అయితే ఇప్పుడు కనీసం బిజిఎం కోసమైనా తమన్ కు ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటే ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యింది.


ఈమధ్య తమన్ తన మ్యూజిక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. మరి ఒకసారి తమన్ కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతున్న కారణం చేత మనవాళ్లను కాదనుకున్నారో ఏమో కాని సైరా మ్యూజిక్ విషయంలో తేడా వస్తే మాత్రం కచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: