'బిగ్ బాస్' సీజన్ 3 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ట్రేండింగ్ షో. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ 'బిగ్ బాస్ సీజన్ 3 షో' కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ బాస్ షో వాయిదా పడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ వాయిదాకు కారణం ప్రముఖ యాంకర్ శ్వేత రెడ్డి చేసిన ఆరోపణలే కారణం అని అంటున్నారు నెటిజన్లు.  


సరిగ్గా 10 రోజుల్లో బుల్లి తెరపై బిగ్ బాస్ ప్రారంభమవుతున్న అవుతున్న సమయంలో బిగ్ బాస్ లో కాంటస్టెంట్లు ఎన్నుకునే విధానంపై శ్వేత రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేస్తేనే అవకాశం లభిస్తుందని ఆమెతో అన్నారని సంచలన ఆరోపణలు చేశారు, అది బిగ్‌బాస్ కాదు, బ్రోతల్ హౌస్ అంటూ ఆమె మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది శ్వేత రెడ్డి. 


దీంతో బిగ్ బాస్ షో ప్రారంభవుతుందా లేదా అనే ఆలోచనలో పడ్డారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతే రోజు కామెడీ ఏ అని ఆలోచించే నెటిజన్లకు వాయిదా అనేది కొంచం భాధ కలిగించే విషయమే. కాగా శ్వేత రెడ్డి చేసిన ఆరోపణలకు ఇప్పటి వరుకు స్టార్ మా, బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించనే లేదు. అయితే ఈ బిగ్ బాస్ షో కు తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో మంచి ఆదరణ ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: