`కుమారి 21 ఎఫ్` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హేబా పటేల్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి..వరుసగా చాలా సినిమా అవకాశాలను అందుకుంది. అయితే చేసిన సినిమాలు అన్నీ చాలా వరకు నిరాశపరచడంతో హేబా పటేల్ కెరియర్ ప్రస్తుతం అంధకారంలో పడింది. వరుసగా గతంలో చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆశించిన విజయాలు రాకపోవడంతో ఈ ముంబై ముద్దుగుమ్మ కి అవకాశాలు లేకపోవడంతో ..ఇటీవల `24 కిస్సెస్` అంటూ మరో బోల్డ్ సినిమాలో నటించింది.


కానీ డీగ్రేడ్ అంటూ జనాలు తిరస్కరించారు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న హెబ్బా పటేల్ తాజాగా నితిన్ నటిస్తున్న భీష్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. భీష్మ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్నది. అయితే ప్రస్తుతం  నితిన్ - హెబ్బా జంటపై కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ రెడీ అవుతోంది. ఇదో రొమాంటిక్ డ్రామా.


ఇందులో హెబ్బాతో కాస్తంత ఘాటైన రొమాన్స్ ఉంటుందట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: