టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా  జులై 18 వ తారీఖు న విడుదల కానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లా విషయమై వెనక్కి తగ్గారు డైరెక్టర్ అండ్ నిర్మాత పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఏరియాలో చాలా డార్క్ పిరియడ్ లో ఉన్న నేపద్యంలో 'ఇస్మార్ట్ శంకర్' కచ్చితంగా హిట్ అవాల్సిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందే బాలకృష్ణ తో పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నారు అన్న వార్తలు బయటకు రావడంతో ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో క్లారిటీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్.


గతంలో బాలయ్య పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా రావడం జరిగింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ...అదే క్రమంలో ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పూరి తో కచ్చితంగా మరొక సినిమా చేస్తానని బాలకృష్ణ మాట ఇవ్వడంతో...ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు పై స్పందించారు పూరి.  ఇప్పటికే బాలకృష్ణ తో సినిమా చేశాను అది సరిగ్గా ఆడలేకపోయింది.


అయితే బాలకృష్ణ తో సినిమా అంటే కచ్చితంగా సరైన కథ రాసుకుని వెళ్లాలి..దానికి టైం పడుతుంది అంటూ..ప్రస్తుతం నా చేతిలో ఉన్న కథలు ఏమి కూడా బాలకృష్ణ కి సూట్ అయ్యే కథలు కాదని...బాలకృష్ణ తో సినిమా తీయాలంటే చాలా బలంగా ఆలోచించి స్టోరీ రాయాలని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. దీంతో స్టోరీ సెట్ అయ్యాక బాలయ్యతో సినిమా తీయడం గ్యారెంటీ అని పూరి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: