ఓ ప్రాజెక్టును క్రేజ్ లేకుండా ఎలా మార్చాలో ఓంకార్ ను చూసి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు కాస్తో కూస్తో హైప్ ఉన్న రాజుగారిగది-3 ప్రాజెక్ట్ ను పూర్తిగా నీరుగార్చేశాడు ఈ దర్శకుడు. తన చేతులారా సినిమాపై అంచనాలు తగ్గించేశాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రిలీజ్ చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజుగారి గది పెద్ద హిట్ అయిందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది-2లో నాగార్జున, సమంత లాంటి స్టార్ట్స్ నటించారు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే, రిలీజ్ కు ముందు ఆ సినిమాకు కూడా చాలా హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. సినిమా మాత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. కానీ రాజుగారి గది-3కి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడీ ప్రాజెక్టులో స్టార్ ఎట్రాక్షన్ ఏమాత్రం కనిపించడం లేదు.

రాజుగారి గది-3లో ముందుగా తమన్నాను అనుకున్నారు. భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. కానీ చిన్న బాలీవుడ్ ఆఫర్ రావడంతోనే ఆమె చెక్కేసింది..అని చెప్తున్నారు. అయితే అసలు కారణం మాత్రం వేరే ఉందన్న విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత తమన్నా స్థానంలో కాజల్ లేదా తాప్సిని తీసుకొని ఉంటే సినిమాపై అంచనాలు అలానే ఉండేవి. కనీసం నందిత శ్వేత లాంటి అమ్మాయిని తీసుకున్నా ఉన్నంతలో గుడ్డి  లో మెల్ల అన్నట్టుగ్గ కాస్త బెటర్ గా ఉండేది. కానీ అందర్నీ కాదని అవిక గౌర్ ను ఎంపిక చేశాడు ఓంకార్.

అవికాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయారు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తర్వాత ఆమె పూర్తిగా తెలుగు సినిమాకు దూరమైంది. హాయిగా తనకు ఇష్టమైన హిందీ సీరియల్స్ చేసుకుంటోంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి తన సినిమాలో మెయిన్ లీడ్ గా పెట్టుకున్నాడు ఓంకార్. అలా రాజుగారి గది-3 సినిమాపై అంచనాల్ని తన చేతులతో తానే తగ్గించేశాడు. మరి టాప్ హీరోయిన్స్ అందరికి ఓంకార్ మీద నమ్మకం పోవడంతోనే ఇలా చేశాడా అని ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. మరి దీనిమీద ఓంకార్ ఏమని స్పందిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: