శర్వానంద్ కు సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకున్న పడి పడి లేచెమనసు సినిమా కూడా పాపం శర్వాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకే ఎన్నో ఆశలతో భారీ అంచానాలతో రణరంగం సినిమాను రెడీ చేసి కూర్చున్నాడు. అయితే ఈ సినిమా అన్ని విధాలా పూర్తయిపోయి విడుదలకు రెడీగా వుందని తెలిసిందే. అందుకే జూన్ నుంచి సరైన డేట్ కోసం చూస్తూ, మెల్లగా ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నారు. ఆగస్టు 2 రిలీజ్ చేద్దాం అనుకుంటే ముందు డియర్ కామ్రేడ్, వెనుక మన్మథుడు 2 రెడీగా వున్నాయి. దాంతో రిలీజ్ చేయాలా? వద్దా? లేకపోతే సెప్టెంబర్ కు వెళ్లిపోవాలా? అన్న డైలమాతో వున్నారు చిత్ర బృందం. 

ఇప్పుడు ఆ సినిమా ఒక అద్భుతమైన డేట్ దొరికింది. అందుకు కారణం ప్రభాసే. బాహుబలి ప్రభాస్ సాహో సినిమా వాయిదా పడడంతో, అర్జెంట్ గా ఆగస్టు 15 విడుదల అని డేట్ ప్రకటించేసారు రణరంగం చిత్ర యూనిట్. కానీ ఇక్కడా సోలో డేట్ దొరకలేదు. పివిపి నిర్మించిన అడవి శేష్ 'ఎవరు' సినిమా కూడా ఇదే డేట్ కు అనౌన్స్ చేసారు.

వాస్తవానికి 'ఎవరు' సినిమా ఆగస్టు 23 అని అనుకున్నారు. అయితే ఎప్పుడయితే ఆగస్టు 15 ఖాళీ అయిందో వెంటనే ఓ వారం ముందుకు వచ్చారు. అయితే జోనర్ లు వేరు, సినిమా సైజ్ వేరు కాబట్టి, సెలవులు కలిసి వచ్చాయి కాబట్టి, రెండు సినిమాలు అయినా నెట్టుకొచ్చేస్తాయని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. శర్వానంద్ రణరంగం సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించగా..సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు . 



మరింత సమాచారం తెలుసుకోండి: