డియర్ కామ్రేడ్ మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో ఇటీవల ప్రమోషన్లో హీట్ పెంచేసిన దేవరకొండ ప్రస్తుతం బెంగళూరు.. కొచ్చి.. చెన్నయ్.. హైదరాబాద్ అంటూ తెగ తిరిగేస్తున్నాడు. ప్రతిచోటా లైవ్ ఈవెంట్లతో అభిమానుల్ని కలుస్తున్నాడు. ఇలా కలిసేందుకు వెళ్లిన ప్రతీచోట జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు. ఓ వెన్యూ వద్దకు ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వచ్చారు. అసలు ఆ ఈవెంట్ నిర్వాహకులు ఆ ఫ్లోటింగ్ ని అస్సలు ఊహించలేదు. ఆర్గనైజర్స్ అసలు ఆ వేదిక దగ్గర సరైన వసతుల్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఫ్యాన్స్ వేదిక దగ్గరకు దూసుకొచ్చారు. 

ఆ క్రమంలోనే బోలెడంత గందరగోళం నెలకొందట. దీంతో ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సొచ్చిందట. ఈ లాఠీ ఛార్జ్ లో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖంపై ఎర్రగా బొబ్బలు తేలిపోయి కనిపించింది. అయితే ఆ ఫ్యాన్ దగ్గరకు వచ్చి ఓదారుస్తూ దేవరకొండ కంగారు పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.

తన ఫ్యాన్ కి ఇలా జరగడంతో ఆగలేకపోయిన విజయ్ ఆ ఈవెంట్ నిర్వాహకులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. గడిచిన ఈవెంట్లు ఇలా షాకివ్వడంతో ప్రస్తుతం జరగనున్న చెన్నయ్.. హైదరాబాద్ ఈవెంట్ల విషయంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ  జరగకుండా జాగ్రత్త పడాలని నిర్వాహకులకు విజయ్ సూచించాడట. అభిమానుల్ని నిరాశపరిచేలా లేదా వారి హృదయాలు గాయపడేలా ఏదీ ఉండకూడదని దేవరకొండ సీరియస్ గానే చెప్పాడటని తెలుస్తోంది. జూలై 18న హైదరాబాద్ లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఆ తర్వాత రోజే చెన్నయ్ లోనూ ఈవెంట్ జరగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: