ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో  'సాహో' రూపొందుతుంది... శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు... హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఎక్కువమంది ఈ సినిమా కోసం పనిచేశారు. హాలీవుడ్ సినిమాల తరహా యాక్షన్ సీన్స్ తో సాహో సినిమా ప్ర‌భాస్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది...

ఈ సినిమా మొత్తం మీద యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ కోసం ఖరీదైన కార్లను 120 వరకూ ఉపయోగించారట.. కేవలం దుబాయ్ లో చేసిన ఒక ఛేజింగ్ సీన్ కోసం 56 కార్లను వాడినట్టుగా చెబుతున్నారు... మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం 18 కార్లను ఉపయోగించారని అంటున్నారు. ఇలా ఈ సినిమా కోసం 120 ఖరీదైన కార్లను ఉపయోగించినట్టు సమాచారం. ఈ స్థాయిలో ఖరీదైన కార్లను ఉపయోగించిన తొలి సినిమా 'సాహో'నే అవుతుందని చెబుతున్నారు.

ఇక పోతే  ఈ చిత్రం  సినిమా షూటింగ్  పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్న త‌రుణంలో ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగ‌స్ట్ 15న రానుంద‌ని ఇప్ప‌టికే చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే తాజాగా వినిపిస్తున్న ప్ర‌చారం ఏంటంటే ఈ సినిమా 15 రోజులు వాయిదా ప‌డింద‌ని.  ఆగ‌స్ట్ 15 నుంచి 30కి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి త‌రువాత వ‌స్తున్న ప్ర‌భాస్ సాహో సినిమా భారీ బ‌డ్జెట్టుతో రూపొందుతూ..ప్ర‌పంచ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్థుల్ని చేయ‌ప్రభాస్డం గ్యారంటీ అంటున్నారు... ఆల్ ది వెరీ బెస్ట్ ప్ర‌భాస్‌.....


మరింత సమాచారం తెలుసుకోండి: