నందమూరి బాలకృష్ణ అంటే ఫైర్..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన ముందుకు ఎవరు వెళ్లినా..ఆయన ఎవరి ముందుకు వచ్చినా..అవతలి వారికే కష్టం. ఈ విషయం తెలియక అప్పుడప్పుడు అభిమానులు ఆయన ముందుకు వెళ్లి తన్నులు తింటుంటారు.  అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.  ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ త్వరలో వెండి తెరపై తన పవర్ చూపించబోతున్నారు.  అయితే సోషల్ మీడియాలో బాలకృష్ణ మహా కోపిష్టి అని..ఎవరిని పడితే వారిని కొడతారని ఆ విషయంలో ఆయనకు చెడు పేరు వస్తుందని వార్తలు వస్తున్నాయి. 

తాజాగా ఈ విషయంపై స్పందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అసలు బాలయ్యకు ఎందుకు కోపం వస్తుంది..అవతలి వారిపై ఎందుకు చేయి చేసుకుంటారన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. పబ్లిక్ లోకి హీరోయిన్లు వెళ్ళినప్పుడు మీద పడిపోయే ఆకతాయిలు ఉంటారు. హీరోయిన్లకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు..ఎవడు ఏ వైపు నుంచి వచ్చి ప్రమాదం సృష్టిస్తారో తెలియదు కదా? అందుకే ప్రమాదకరంగా తన మీదకు వచ్చే వాళ్ళని బాలయ్య కొడుతుంటారు.

మిగిలిన హీరోలు ఈ పని చేయరు కాబట్టి బాలయ్య మాత్రమే అందరికి కోపిష్టిలా కనిపిస్తున్నారు.  మిగిలిన హీరోలకు పబ్లిక్ లో ఎక్కువగా వెళ్లరు..అందుకే వారు అంతగా బయట పడరని అన్నారు. వాస్తవానికి బాలయ్యబాబు ఎంతో మంచి మనసు గల వ్యక్తి అని కష్టం వస్తే ముందుండి చూసుకునే మంచి మనిషి అని అన్నారు. పూరి జగన్నాధ్, బాలకృష్ణ కాంబినేషన్ లో పైసా వసూల్ మూవీ వచ్చింది. త్వరలో మరోసారి ఈ కాంబినేషన్ వెండి తెరపై ఉండోచ్చని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: